నెల్లూరు జిల్లాలో ఒకే సామాజిక వర్గానికి చెందిన ముగ్గురి ఒకేసారి తిరుగుబాటుతో అధికార వైసీపీలో కౌంట్ డౌన్ స్టార్ట్ అయిందని నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు పేర్కొన్నారు. పార్టీలో అవమానాలను దిగమింగుకుంటూ ఉన్నవాళ్లంతా ఆత్మగౌరవంతో తిరగబడే రోజులు ప్రారంభమయ్యాయన్నారు. ఢిల్లీలో విలేకరులతో మాట్లాడుతూ ఆయనీ వ్యాఖ్యలు చేశారు.
సుప్రీంకోర్టులో తమకు అనుకూలంగా తీర్పు రాకపోతే వచ్చే ఎన్నికల్లో 175 అసెంబ్లీ, 25 పార్లమెంటు స్థానాల్లో విజయం సాధించి కేంద్రంతో పార్లమెంటులో బిల్లు పెట్టించి విశాఖను రాజధానిగా చేస్తామన్న మాజీ మంత్రి కొడాలి నాని వ్యాఖ్యలను గుర్తు చేస్తూ.. మొత్తానికి పార్లమెంటు చట్టం ద్వారానే ఏపీ రాజధాని మార్పు సాధ్యమన్న విషయాన్ని ఆయన గుర్తించారని రఘురామరాజు గుర్తు చేశారు. ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డితో స్నేహం తర్వాత అదానీ కంపెనీ షేర్లు కుప్పకూలిపోయాయని… దీనినిబట్టి చుస్తే ఈయనతో చేతులు కలిపితే సర్వ నాశనమే .. అని రఘురామరాజు పేర్కొన్నారు.