కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి తెలంగాణ హైకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. సీఎం జగన్మోహన్ రెడ్డి చిన్నాన్న వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసుకు సంబంధించి ఎంపీ అవినాష్ పిటిషన్ను కోర్టు తోసిపుచ్చింది.. అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయొద్దని తాము చెప్పలేమంది. సీబీఐ విచారణ చేసుకోవచ్చని.. కోర్టుకు ఇచ్చిన ఆధారాలను సీబీఐకి తిరిగి ఇచ్చేసింది. అవినాష్ రెడ్డి, ఆయన తండ్రి భాస్కర్ రెడ్డి లను అరెస్ట్ చేసేందుకు సీబీఐకి న్యాయపరంగా ఉన్న ఆటంకాలు తొలగిపోయాయి. అయితే సీఎం జగన్ ఢిల్లీ ప్రధాని మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా లను కలిసేందుకు ఢిల్లీ వెళ్లారు. అక్కడ లాబీయింగ్ పనిచేస్తే అవినాష్, భాస్కర్ రెడ్డి అరెస్టులపై మళ్ళీ మతలబు ఏర్పడే ఛాన్స్ ఉంటుంది.