ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధాని అమరావతి ఉండాలని డిమాండ్ చేస్తూ.. అమరావతికి భూములు ఇచ్చిన రైతులు చేపట్టిన మహాపాదయాత్రకు .. శనివారం బ్రేక్ పడింది. అంబెడ్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురంలో పోలీసులు పాదయాత్రకు ఆటంకం సృష్టిస్తున్నారంటూ నిర్వాహకులు యాత్రను తాత్కాలికంగా నిలిపివేశారు. ‘ప్రస్తుతం హైకోర్టు సెలవు కారణంగా పాదయాత్రకు నాలుగు రోజులు విరామం ఇస్తున్నాం. కోర్టు చెప్పినా పోలీసులు ఇబ్బందులకు గురిచేస్తున్నారు.. కోర్టు తెరిచాక ధిక్కారణ పిటిషన్ ఫైల్ చేస్తాం..’ అని అమరావతి జెఏసి నేతలు తెలిపారు.