మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి కేసు లో కడప ఎంపీ అవినాష్ రెడ్డి వేసిన రిట్ పిటిషన్పై తెలంగాణ హైకోర్టు (Telangana High Court) లో వాదనలు జరిగాయి. సోమవారం వరకు అవినాష్ రెడ్డి (MP Avinash Reddy) ని అరెస్ట్ చేయవద్దని హైకోర్టు (High Court) ఉత్తర్వులు జారీ చేసింది. హార్డ్ డిస్క్లో వీడియోగ్రఫీ, ఆడియోలను హైకోర్టుకు సమర్పించాలని ఆదేశించింది. హత్య జరిగిన ప్రాంతంలో దొరికిన లెటర్ను, అవినాష్ రెడ్డి కేసు వివరాలు మొత్తం సమర్పించాలని సీబీఐ (CBI) కి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. సీబీఐ ఎస్పీ ఈరోజు (శుక్రవారం) మధ్యాహ్నం 2:30 గంటలకు కోర్టుకు వచ్చి అవినాష్ రిట్ ఫిటిషన్పై కౌంటర్ ధాఖలు చేశారు. అనంతరం హైకోర్టు సోమవారం వరకు అవినాష్ రెడ్డి అరెస్ట్ చేయొద్దని ఆదేశించింది. దీంతో ఈ కేసుకు సంబంధించి ఎంపీ అవినాష్రెడ్డికి స్వల్ప ఊరట లభించినట్లైంది. విచారణను వీడియో రికార్డింగ్ చేస్తున్నట్టు సీబీఐ పేర్కొంది. వీడియోగ్రఫీ, ఆడియో గ్రఫీ రికార్డ్లు ఎప్పుడు సమర్పిస్తారని న్యాయస్థానం అడగగా.. తాము ఇప్పుడే కోర్ట్కి సమర్పించడానికి సిద్ధంగా ఉన్నామన్న సీబీఐ ఎస్పీ రాంసింగ్ కోర్ట్కు తెలిపారు. ఇప్పుడే న్యాయస్థానానికి ఇవ్వాలని ఆదేశించిన అందించడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. కాగా అవినాష్ రెడ్డి నిందితుడా ? సాక్షి నా? అని న్యాయస్థానం ప్రశ్నించగా.. 160 సీఆర్పీసీ (CRPC) కింద అవినాష్ రెడ్డికి నోటీసుల ఇచ్చామని, సాక్షిగా పరిగణించిన ఈకేసులో అవసరమైతే అవినాష్ రెడ్డిని, భాస్కర్ రెడ్డిని అదుపులోకి తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. హత్యాస్థలిలో దొరికిన లేఖ తమ వద్దే ఉందని హైకోర్టుకు సీబీఐ చెప్పింది. లేఖపై సీఎఫ్ఎస్ఎల్ అభిప్రాయం తీసుకున్నామని, తీవ్ర ఒత్తిడిలో లేఖ రాసినట్లు సీఎఫ్ఎస్ఎల్ (CFSL) తెలిపిందని సీబీఐ పేర్కొంది. మరోవైపు సునీత ఇంప్లీడ్ పిటిషన్పై అభ్యంతరం ఉందా అని హైకోర్టు అడిగింది. సోమవారం రోజు విచారణకు రావాలని అవినాష్ను కోరుతామని రాంసింగ్ కోర్టుకు తెలిపారు. అయితే సోమవారం న్యాయస్థానంలో విచారణ ఉంది కాదా అని గుర్తుచేసింది. దీంతో మంగళవారం విచారణ చేస్తామని సీబీఐ తెలిపింది.